ఇంట్లో దోమల మందు బాటిల్ పేలి..ఒకే కుటుంబంలో నలుగురు మృతి…!

-

దోమల మందు బాటిల్ పేలడంతో ఊపిరి ఆడకుండా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ షాకింగ్‌ సంఘటన చెన్నైలోని మనాలీలో జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఉండే దోమల మందు బాటిల్ పేలడంతో ఊపిరి ఆడకుండా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

నిన్న రాత్రి ఇంట్లో దోమల కోసం కరెంట్ ప్లగ్‌ లో లిక్విడ్ బాటిల్ పెట్టారు. అయితే.. అదే సమయంలో.. షాక్ సర్య్కూట్ తో ఒక్కసారి దోమల మందు లిక్విడ్ బాటిల్ పేలిపోయింది. ఈ పేలుడు వల్ల స్విచ్ కింద ఉన్న బట్టలకు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. లిక్వీడ్ సహా పొగ వల్ల ఊపిరి ఆడుకుండా నలుగురు చనిపోయారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news