మెదక్‌లో దారుణం.. ప్రైవేటు బ‌స్సు బోల్తా ప‌డి తల్లికూతురు మృతి

-

మెద‌క్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్ర‌యివేటు బ‌స్సు అదుపు త‌ప్పింది. దీంతో ఆ బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో త‌ల్లీ కూతురు ఇద్ద‌రు మృతి చెందారు. అలాగే మ‌రో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న మెద‌క్ జిల్లా లోని హ‌వేళి ఘ‌న‌పూర్ వ‌ద్ద చోటు చేసుకుంది. హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన కొంత మంది ఒక ప్ర‌యివేటు బ‌స్సు లో అజ్మీర్ వెళ్తున్నారు. కాగ మార్గ మ‌ధ్య‌లో మెద‌క్ జిల్లాలోని హ‌వేళి ఘ‌న‌పూర్ వ‌ర‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ ప్రైవేటు బ‌స్సు.. అద‌పు త‌ప్పింది. దీంతో బోల్తా ప‌డింది.

ఈ ప్ర‌మాదంలో ఆ బ‌స్సు లో ప్ర‌యాణిస్తున్న తల్లీ కూతురు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. అలాగే మ‌రో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగ స్థానికులు పోలీసులుకు స‌మాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. బ‌స్సులో తీవ్ర గాయాలు అయిన వారిని బ‌య‌టకు తీశారు. కొంత మందిని మెద‌క్ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగ మ‌రి కొంద‌రిని ప్రయివేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌ని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news