అంబులెన్స్‌లో రూ.25 కోట్లపైగా దొంగ నోట్లు

-

గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు భారీగా దొంగ నోట్లను పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్‌లో తరలిస్తున్న రూ.25.80 కోట్ల ఫేక్‌ కరెన్సీని పోలీసులు సీజ్ చేశారు. దొంగ నోట్లను తరలిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేశారు. వాహనంలో నుంచి  ఆరు పెట్టెల్లో, రెండు వేల రూపాయల నోట్ల కట్టల(1,290 కట్టలు)ను సీజ్ చేశారు. అయితే, ఆ కరెన్సీపై ‘రివర్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని ముద్రించి ఉండటం గమనార్హం.

అంబులెన్స్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని స్థానిక ఎస్పీ హితేశ్‌ జోయ్‌సర్‌ మాట్లాడారు. తదుపరి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నోట్లు ఎక్కడ అచ్చు వేశారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్‌ బృందం సైతం ఆధారాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news