మూడేళ్ళ బాలికను రేప్ చేసి చెరుకు తోటలో పడేసారు…!

-

ఉత్తర ప్రదేశ్‌ లోని లఖింపూర్ ఖేరిలో చెరకు పొలంలో చనిపోయిన మూడేళ్ల బాలిక శవాన్ని నేడు పోలీసులు గుర్తించారు. ఆమెను హత్య చేసారని, హత్యకు ముందు అత్యాచారం జరిగిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం మీడియాకు వివరించారు. జిల్లాలో ఈ వారంలో ఇది మూడవ సంఘటన. తలపై గాయాల గుర్తులు ఉన్న బాలిక మృతదేహాన్ని సింగాహి ప్రాంతంలోని ఆమె గ్రామ పరిసరాల్లో గుర్తించారు.

minor girl molested by her step brother in jharakhand

పోస్టుమార్టం నివేదిక అత్యాచారాన్ని ధృవీకరించిందని పోలీస్ అధికారి ఒకరు వివరించారు. తాను ప్రస్తుతం బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నా అని చెప్పుకొచ్చారు. ఏడు బృందాలు ఈ కేసుని విచారిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చెరుకు తోటలో విచారణ చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తండ్రి పై ఉన్న పగతో బాలికను రేప్ చేసి చంపారట.

Read more RELATED
Recommended to you

Latest news