Breaking : నిజామాబాద్‌లో ఉపాధ్యాయురాలు ఆత్మహ‌త్య

-

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. నిజామాబాద్ జిల్లాలోని భీంగ‌ల్ మండ‌లం బాబాపూర్ లో ఉపాధ్యాయురాలు స‌ర‌స్వ‌తి (36) ఆత్మ హ‌త్య చేసుకుంది. అయితే స‌ర‌స్వ‌తి అనే ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు ఇటీవ‌ల కామారెడ్డి జిల్లా గాంధారి మండ‌లానికి బ‌దిలీ అయింది. అయితే బ‌దిలీ అయిన త‌ర్వాత కొద్ది రోజుల‌కే ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు స‌ర‌స్వ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ప్ర‌స్తుతం ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

suicide

అయితే ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల‌ను బ‌దిలీలు చేసింది. అందులో జీవో నెంబ‌ర్ 317 ను విడుద‌ల చేసింది. అయితే ఈ జీవో నెంబ‌ర్ 317 ను చాలా మంది వ్య‌తిరేకిస్తున్నారు. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ కూడా జీవో నెంబ‌ర్ 317 ను స‌వ‌రించాల‌ని ఆందోళ‌న చెప‌ట్టారు. ఇదీల ఉండగా.. నిజామాబాద్ లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు స‌ర‌స్వ‌తి ఆత్మ‌హ‌త్య పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news