దారుణం: నానమ్మ పై పెట్రోల్ పోసి తగులబెట్టిన మనవడు…!

-

తనకు దక్కాల్సిన ఆస్తిని మేనత్తలకు రాసి ఇచ్చిందని సొంత నానమ్మ ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఓ బాలుడు. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే… ఎలవర్తి గ్రామానికి చెందిన ఓ బాలుడు తన నానమ్మ కంసమ్మ తన ఆస్తి లో కొంత భాగాన్ని ఆమె కూతుర్ల పేరిట రిజిస్టర్ చేసింది. ఇక అప్పటినుండి సదరు బాలుడు తన నానమ్మ పై పగ పెంచుకున్నాడు. తాను అనుభవించాల్సిన ఆస్తిని తన మేనత్త లకు పంచడంతో ఆ బాలుడు పగ పెంచుకున్నాడు.

fire
fire

ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం ఇంట్లోనే ఉన్న నానమ్మ పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీనితో తీవ్రంగా గాయాలైన ఆవిడ అక్కడికక్కడే మరణించింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ లో నానమ్మను చంపిన మనవడు అక్కడి నుండి పారిపోయాడని తేలింది. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే పరారీలో ఉన్న సదరు బాలుడిని పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news