దారుణం: ముగ్గురు పూజారులని హతమార్చిన దుండగులు..

-

కర్నాటకలో జరిగిన పూజారుల హత్యలు సంచలనంగా మారాయి. మాండ్యాలో ఉన్న అర్కేశ్వర ఆలయంలో జరిగిన సంఘటన యావత్ రాష్ట్రానికే పెద్ద షాక్ లా ఉంది. ముగ్గురు పూజారులు ఆలయంలో శవాలుగా పడి ఉండడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయమై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేరస్తులని త్వరలోనే పట్టుకుంటామని, చనిపోయిన వారికి ఐదు లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

 

పోలీసుల వివరాల ప్రకారం దుండగులు దొంగతనం కోసమే వచ్చారని చెబుతున్నారు. హుండీలో నుండి డబ్బులు తీసుకుంటుంటే అడ్డుపడిన పూజారులని బండరాళ్లతో తలమీద కొట్టి చంపేసారని కేసు నమోదు చేసారు. మృతుల పేర్లు గణేష్, ప్రకాష్, ఆనంద్ అని తెలియజేసారు. దొంగతనానికి వచ్చిన వారే ఇలా చేసి ఉంటారని అనుకుంటున్న పోలీసులు విచారణ వేగవంతం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news