ఖ‌మ్మంలో విషాదం.. చెట్టు కూలి ఇద్ద‌రు చిన్నారులు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్న స‌మ‌యంలో భారీ ఆకారంలో ఉన్న‌ చెట్టు కూలింది. దీంతో ఇద్ద‌రు చిన్నారులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో నలుగురు చిన్నారుల‌కు గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని బ్ర‌హ్మ‌ణ బ‌జారులో జ‌రిగింది. అయితే ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని బ్ర‌హ్మ‌ణ బ‌జారు లో మంగ‌ళ వారం సాయంత్రం కొంత మంది చిన్నారులు ఖాళీ స్థ‌లంలో క్రికెట్ ఆడుకుంటున్నారు.

అయితే వీరి పక్క‌నే ఉన్న భారీ చెట్టు ఒక్క సారిగా కూలింది. దీంతో దిగాంత్ శెట్టి (11), రాజ్ పుత్ ఆయుష్ (6) పై చెట్టు ప‌డింది. దీంతో ఈ ఇద్ద‌రు చిన్నారులు మృతి చెందారు. అలాగే క్రికెట్ ఆడుకుంటున్న మ‌రో న‌లుగురు చిన్నారుల‌కు గాయాలు అయ్యాయి. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన స్థానికులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి గాయప‌డ్డ నలుగురు చిన్నారుల‌ను బ‌య‌ట‌కు తీశారు. అనంతరం వీరిని జిల్లా కేంద్రంలోని ఒక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Latest news