భ‌ర్త‌పై భార్య యాసిడ్ దాడి

-

వివాహేతర సంబంధం ఓ కుటుంబ‌లో క‌ల‌క‌లం రేపింది. అనుమానం పెనుభూత‌మైంది. తనను కాదని మరొకరితో సంబంధం కొన‌సాగిస్తున్నాడ‌న్న అనుమానంతో భార్య భర్త పై యాసిడ్ పోసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగుచూసింది.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాస‌నగర్‌కు చెందిన నరసింహారావు (50), లక్ష్మీ భార్యభర్తలు. అయితే, నరసింహారావు వేరే వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న అనుమానంతో లక్ష్మీ నిలదీసేది. కొంత కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం ఆ గొడవ కాస్తా ముదిరింది. భర్తపై ఆగ్ర‌హంతో భార్య లక్ష్మీ ఇంట్లో నుంచి యాసిడ్ తీసుకొచ్చి మొహం మీద పోసింది. అది కాస్తా కంటిలో పడడంతో నరసింహారావు ఆ మంట తట్టుకోలేక బయటకు పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు ఆయనను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అసలు విషయం పై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news