CURFEW : కర్ఫ్యూపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం : ఇక రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలు

-

అమరావతి : కోవిడ్‌ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు చేయాలని.. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఉండేలా.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపులు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

రాత్రి 9 గంటల కల్లా దుకాణాల మూసివేయాలని, 10 గంటల తర్వాత కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇక నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలు ఉంటుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు చేయాలని.. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలు ఉంటాయని.. అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ఆదేశాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధింపు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ రూపొందించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news