ప్రాప‌ర్టీ కొనాల‌ని చూసేవారికి ఎస్‌బీఐ స‌ద‌వ‌కాశం.. ఇ-వేలం ద్వారా త‌క్కువ ధ‌ర‌కు కొన‌వ‌చ్చు..

-

వాణిజ్య ప‌రమైన లేదా నివాస లేదా ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్రాప‌ర్టీల‌ను కొనాల‌ని చూస్తున్నారా ? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మీకు స‌ద‌వ‌కాశం క‌ల్పిస్తోంది. ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు ఎస్‌బీఐ నిర్వ‌హించ‌నున్న ఇ-వేలంలో పాల్గొని త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆయా ప్రాప‌ర్టీల‌ను వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

customers can get properties for cheap rates in sbi e auction

ఆస్తులు త‌న‌ఖా పెట్టి లోన్లు తీసుకుని చెల్లించ‌ని క‌స్ట‌మ‌ర్ల‌కు చెందిన ప్రాప‌ర్టీల‌కు ఎస్‌బీఐ ఇ-వేలం నిర్వ‌హించ‌నుంది. అందుకుగాను ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉన్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ ఆధీనంలోని 3032 రెసిడెన్షియ‌ల్‌, 844 క‌మ‌ర్షియ‌ల్‌, 410 ఇండ‌స్ట్రియ‌ల్ ప్రాప‌ర్టీల‌కు వేలం నిర్వ‌హించ‌న‌న్నారు.

ఇక వేలంలో పాల్గొనేవారు ఆయా ప్రాప‌ర్టీల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో పాల్గొనేందుకు ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు క‌స్ట‌మ‌ర్లు కింద తెలిపిన సైట్ల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

bankeauctions.com/Sbi
sbi.acutiontiger.net/EPROC/
ibapi.in
mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp

Read more RELATED
Recommended to you

Latest news