ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్ విజేత ఢిల్లీ

-

ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదవ సీజన్ విజేతగా దబాంగ్ ఢిల్లీ నిలిచింది. బెంగళూరు వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాట్నా పై ఒక్క పాయింట్ తో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ లో ఢిల్లీ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. మ్యాచ్ లో మొదటి పాట్నా టీం ఆధిపత్యం చెలాయించిన అప్పటికీ… నెమ్మదిగా పుంజుకున్న దబాంగ్ ఢిల్లీ ఊహించని విజయాన్ని అందుకుంది.

ఫస్టాఫ్ ముగిసే సమయానికి 15 17 తో ఢిల్లీ వెనుకబడినా… చివరలో 37 36 టైటిల్ను ఎగరేసుకుపోయింది. దబాంగ్ ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ 13 పాయింట్లతో చెలరేగగా.. ఆల్ రౌండర్ విజయ్ పద్నాలుగు పాయింట్లతో సత్తా చాటాడు.

ఓవరాల్ గా నవీన్ కుమార్ ఎనిమిదవ సీజన్ లో ఏకంగా 200 పాయింట్లు సాధించడం విశేషం. మరో వైపు పార్టిలోని సచిన్ సూపర్ టీం తో ఫర్వాలేదనిపించినా… అతనికి పెద్దగా సపోర్ట్ లభించలేదు. ఓవరాల్‌ గా నవీన్‌ కుమార్‌ ఈ 8వ సీజన్‌ లో ఏకంగా 200 పాయింట్లు సాధించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news