డిసెంబర్ లోనే తెలంగాణ లో ఎన్నికలు : మాజీ ఉప ముఖ్యమంత్రి

-

2022, డిసెంబర్ లోనే ఎన్నికలు రాబోతున్నాయని.. దీనికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ అన్నారు. రేవంత్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసారు కాంగ్రెస్ నేతలు. ఈ సంధర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ లో ఉత్సహం కనిపిస్తుందని తెలిపారు.

దళితులకు మూడెకరాలు ఇస్తామని 2014, ఆగస్ట్ 15 న సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు…ఆరేండ్లు ఐనా.. దళితులకు భూములియ్యలేదని మండిపడ్డారు. దళితులకు భూములు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనేనని తెలిపారు. టీఆరెస్.. 2018 నుండి ఎక్కడ ఎన్నికలు వచ్చిన డబ్బు వెదజల్లుతుందని… పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రగతి భవన్ ను అంబెడ్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చాలని…ప్రాజెక్టుల పేరుతో.. కల్వకుంట్ల ఫ్యామిలీ లక్ష కోట్ల రూపాయలను దోచుకుందని ఫైర్ అయ్యారు. సీఎం గా పనిచేసిన దామోదర్ సంజీవయ్య ఫ్యామిలీ ఎలా ఉందో చూడండి….రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేశాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news