Breaking : కాంగ్రెస్‌కు మరో షాక్‌.. దాసోజు శ్రవణ్‌ రాజీనామా..

-

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు వేడెక్కాయి. రోజు రోజుకూ ఆ పార్టీకి రాజీనామాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌ది మంది జీవితాల్లో వెలుగులు నింపాల‌న్న ఉద్దేశ్యంతోనే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌కంగా ప‌నిచేశాన‌ని తెలిపారు దాసోజు శ్రవణ్‌ . కాంగ్రెస్‌లో త‌న‌కు అంచెలంచెలుగా ఎదిగే అవ‌కాశాన్ని ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు. రాజ‌కీయం అంటే ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మ‌నే తాను న‌మ్ముతాన‌ని ఆయ‌న తెలిపారు. ఆ న‌మ్మ‌కంతోనే కాంగ్రెస్‌లో ప‌నిచేసుకుంటూ వ‌చ్చాన‌ని అన్నారు దాసోజు శ్రవణ్‌.

Hyderabad: Address farmer issues immediately, demands Dasoju Sravan

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పార్టీలో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయ‌ని ఆరోపించారు దాసోజు శ్రవణ్‌ . తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు ప‌ట్టించార‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని అన్నారు. రేవంత్ త‌ప్పు చేస్తే అడిగే వారే లేర‌న్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఎన్నో నిద్రలేని రాత్రులు గ‌డిపాన‌న్నారు. స‌ర్వేల పేరుతో త‌ప్పుడు నివేదిక‌లు ఇచ్చి మోసం చేస్తున్నార‌న్నారు దాసోజు శ్రవణ్‌ . రేవంత్ రెడ్డి, సునీల్, మాణిక్కం ఠాగూర్‌లు కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు దాసోజు శ్రవణ్‌ .

 

Read more RELATED
Recommended to you

Latest news