తల్లి అప్పులకోసం అత్తింట్లోనే దొంగతనం చేసిన కోడలు..!

-

హైదరాబాద్‌ లోని యాప్రాల్‌ కింది బస్తీలో ఈ నెల 23న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసును చేధించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడంటే ఇదేనేమో. ఈ నెల 23న యాప్రాల్‌ కింది బస్తీకి చెందిన ఓక ఇంట్లో చోరి జరిగింది. 44 తులాల బంగారం, వెండితో పాటు పదివేల వరకు నగదు దొంగతనం జరిగింది. సీసీ మహేశ్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులు అసలు నిందితురాలు ఆ ఇంటి కోడలే. అప్పుల పాలైన తల్లికి సహాయం చేసేందుకే కోడలు అత్తింటికే కన్నం వేసిందని పోలీసులు తెలిపారు.

arrest
arrest

యాప్రాల్‌ కింది బస్తీకి చెందిన ఓ కుటుంబం ఈ నెలలో బంధువుల ఇంట్లో వివాహానికి హాజరైయ్యారు. కుటుంబమాంత తిరిగి వచ్చే సరికి ఇంట్లోని స్టోర్‌ రూంలో సామగ్రి కిందపడేసి ఉండడంతో పాటు అల్మారా పగులగొట్టి ఉంది. 44 తులాల బంగారం, వెండితో పాటు పదివేల వరకు నగదుకు ఎత్తుకు వెళ్లారని కుటుంబ సభ్యులు స్థానిక జవహర్‌నగర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీఎల్‌ మల్కాజ్‌గిరి, ఐటీ సెల్‌ పోలీసులు కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

దీంతో ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఇందులో ఒంటినిండా నల్లటి దుస్తులు కప్పుకొని వచ్చిన వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యక్తిపై అనుమానం వచ్చి మరిన్ని సీసీటీవీల ఫుటేజీలను పరిశీలించగా.. దొంగతనం చేసింది ఆడ మనిషేనని తేల్చారు. ఈ మేరకు విచారణ జరపగా.. ఇంటి యజమాని కోడలే తన తల్లితో కలిసి దొంగతనం చేసినట్లు తెలిసింది. ఇంటికి పెద్ద కోడలైన సోని, తల్లి లీలావతి మాటలు విని దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సోని 2016లో ఇంటి యజమాని కొడుకు విశ్వనాథ్‌ను లవ్‌ మ్యారేజ్‌ చేసుకుందని చెప్పారు. నిందితులు ఇద్దరి నుంచి 44 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.10,500 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులు వాసగోని సోని, నేమూరి లీలావతిపై కేసు నమోదు చేసినట్లు సీసీ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news