కారును ఢీ కొట్టిన డీసీఎం.. వ్యక్తి మృతి

-

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం, కారు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు  జిల్లా మంగపేట మండలం, కమలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని అంబేద్కర్ సెంటర్ మూల మలుపు వద్ద డీసీఎం, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో మండలంలోని రామచంద్రుని పేట గ్రామానికి చెందిన పుప్పాల మల్లయ్య (60) అనే వృద్దుడు మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు కాగా స్థానికులు దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news