Ravindra Jadeja : మొదటి టెస్ట్ లో ఛీటింగ్ చేసిన జడేజా

-

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా గురువారం ఆస్ట్రేలియా – టీమ్ ఇండియాల మధ్య ప్రారంభమైన తొలి టెస్ట్ లో మొదటిరోజు భారత్ సంపూర్ణ ఆదిపత్యం చెలాయించింది. ముఖ్యంగా స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. కాగా, ఈ మ్యాచ్ సమయంలో జడేజా చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

దీంతో పలువురు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు మాజీలు జడేజా బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం అతడు తన వేలికి లోషన్ రాస్తున్నాడని అంటున్నారు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు జడేజా సిద్ధమయ్యాడు. క్రిజులో అలెక్స్ కారే, హాండ్స్ కాంబ్ ఉన్నారు. అప్పటికి ఆస్ట్రేలియా 120-5 తో బ్యాటింగ్ చేస్తోంది.

జడేజా 30 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు కూడా తీసేశాడు. ఈ సమయంలో జడ్డు బౌలింగ్ వేసే ముందు సిరాజ్ చేతిపై నుంచి ఏదో తీసుకున్నాడు. దానిని తన బౌలింగ్ వేస్తున్న చేతి వేలికి రాశాడు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇదే విషయమై స్పందిస్తూ జడేజా తన వేలికి ఏదో రాస్తున్నాడని, ఇలాంటి సంఘటన తాను ఎప్పుడూ చూడలేదు అంటూ రిప్లై ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news