RC 15 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన శంకర్..!

-

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య ఫ్లాప్ అవడంతో చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ఆర్సి15 మూవీ తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? ఎప్పుడు చూసేద్దామా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తుండగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

మరికొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్డేట్ తాజాగా డైరెక్టర్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్లో ప్రస్తుతం చార్మినార్ వద్ద చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి శంకర్ చార్మినార్ దగ్గర ఉన్న ఒక ఫోటోని కూడా షేర్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఒక యాక్షన్ సీక్వెన్స్ లేదా రామ్ చరణ్ పాటలు కానీ ఇక్కడ షూట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పాట చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే చిత్ర బృందం రాజమండ్రి వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్లో రామ్ చరణ్ కియారా అద్వానీ పై ఒక పాట షూట్ చేయగా దీనికోసం దాదాపు రూ.15 కోట్ల మేర ఖర్చు పెట్టారు. అలాగే 500 మంది డాన్సర్లతో మరో పాట చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈ సినిమా హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news