వైసీపీలో ఈ మంత్రులకు ఓటమి తప్పదు: ఆరా మస్తాన్ సర్వే

-

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు రోజా(నగరి), అప్పలరాజు(పలాస), నాగేశ్వరరావు (తణుకు), చెల్లుబోయిన వేణు(రాజమండ్రి.R),గుడివాడ అమర్నాథ్ (గాజువాక),విడదల రజనీ (గుంటూరు పశ్చిమ), ఆదిమూలపు సురేశ్ (కొండేపి) ఉషశ్రీ (పెనుకొండ), సత్యనారాయణ(తాడేపల్లిగూడెం) ఓడిపోతారని ఆరా మస్తాన్ అంచనా వేశారు. జోగి రమేష్ (పెనుమలూరు), ధర్మాన ప్రసాద్ (శ్రీకాకుళం), అంబటి రాంబాబు (సత్తెనపల్లి) గట్టి పోటీ ఎదుర్కొన్నారని తెలిపారు.

ఇక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ స్థానం నుంచి ఓడిపోతారని ఆరా మస్తాన్ వెల్లడించారు. నర్సాపురం, అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న పురందీశ్వరి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత సుజనా చౌదరి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్(బీజేపీ) గెలుస్తారని అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news