తెలంగాణకు ఢిల్లీ ప్రభుత్వం 15 కోట్ల ఆర్థిక సాయం

-

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం ఇప్పటికే పలువురు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి పది కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించారు. ఇక తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఇక ఈ కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

ఈ సంధర్భంగా 15 కోట్ల సాయం ప్రకటించిన కేజ్రీవాల్ కు తెలంగాణ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఈరోజు కొద్ది సేపటి క్రితం కేజ్రీవాల్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు కేసీఆర్ కేజ్రీ వాల్ కి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇప్పటికే పక్క రాష్ట్రాలు ఆర్ధిక సహాయం ప్రకటిస్తున్నా కేంద్రం ఇంకా సైలెంట్ గా ఉండడం విమర్శలకి తావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news