IPL 2021 : బ్యాటింగ్ లో తేలిపోయిన ముంబై.. ఢిల్లీ టార్గెట్ 130

-

ఐపీఎల్ 2021 రెండో సీజన్.. విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ 2021 టోర్నీలో 45 మ్యాచ్ లు పూర్తి కాగా ఇక ఇవాళ ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ కాపీటల్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఢిల్లీ ముందు తక్కువ టార్గెట్ నే ఉంచింది. 20 ఓవర్లలో ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 129 పరుగులు మాత్రమే చేసింది ముంబై ఇండియన్స్ జట్టు.

టాప్ ఆర్డర్ మరియు మిడిలార్డర్ పూర్తిగా విఫలం కావడంతో… తక్కువ స్కోరుకే పరిమితమైంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇక ముంబై బ్యాటింగ్ విషయానికి వస్తే.. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు, హార్దిక్ పాండ్యా 17 పరుగులు మరియు సౌరబ్ తీవారీ 15 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు ను అందించారు.

ఇక మిగతా బ్యాట్స్మెన్లు పూర్తిగా సింగిల్ డిజిట్ స్కోర్ లకే పరిమితమయ్యారు. ఇక అటు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విషయానికి వస్తే… ఆవేష్ ఖాన్ మూడు వికెట్లు మరియు అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ నడ్డి విరిచారు. ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే 20 ఓవర్లలో 130 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి కొద్ది క్షణాల్లోనే ఢిల్లీ క్యాపిటల్స్.. బ్యాటింగ్ కు దిగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news