ఎంఐఎం అంటే టీఆర్ఎస్ కు భయం – కేంద్రమంత్రి స్మ్రుతి ఇరానీ.

-

టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీకి భయమని కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ విమర్శించారు. ఎంఐంఎంకి భయపడే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ జరపడం లేదని దుయ్యబట్టారు. ప్రజా సంగ్రాయ యాత్రకు ముఖ్య అతిధిగా వచ్చిన స్మ్రుతి ఇరానీ టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణలో అవి సాకారం కావడం లేదన్నారు. నిరుద్యోగులకు రూ. 3 వేలు ఇస్తామని ఇచ్చారా.. అని ప్రశ్నించారు. కేంద్రంలో మోడీ సర్కారు మాత్రమే ప్రజల గురించి ఆలోచిస్తున్నారని అందుకు కరోనా వేళ ఉచిత రేషన్, నగదు పంపిణీ చేశారని గుర్తుచేశారు. 80 కోట్ల మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిందని తెలిపారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పోరేషన్ కేంద్రం రైతుల సంక్షేమం కోసం ప్రారంభించనుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని అన్నారు. పీఎం ఆవాసయోజన కింద బీజేపీ పేదలకు ఇళ్లను ఇస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news