ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. నిందితులకి మరోసారి కస్టడీ పొడగింపు

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నేడు సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. నిందితులకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ నాయక్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయి బాబులకు ఈనెల 28వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఈ నలుగురు నిందితులు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

ఈ నలుగురికి ఉచ్చు బిగుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు వీరి కస్టడీ పొడగించగా తాజాగా మరోసారి రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు కస్టడీని పొడిగించింది. నేటితో గతంలో ఇచ్చిన కస్టడీ మోగీయగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు పరిచారు. దీంతో ఈనెల 28 వరకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news