IPL 2022 : టాస్ గెలిచిన ఢిల్లీ.. గెలవాలనే కసిలో కేకేఆర్‌

-

నువ్వానేనా అన్నట్లుగా ఉండబోతోంది ఈ రోజు ఐపీఎల్‌ సీజన్‌ 2022లో జరిగబోయే మ్యాచ్‌. వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరోసారి తలపడబోతోంది. ఈ రోజు జరుగబోయే మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే ఈ సీజన్‌లోనే తొలిసారి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు మ్యాచ్‌ జరుగగా అందులో.. ఢిల్లీ స‌మిష్టిగా రాణించి కేకేఆర్‌పై 44 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ నేపథ్యంలో నాటి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఎదురైన ఓటమికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని కేకేఆర్‌ జట్టు కసిగా ఉంది.

తుది జ‌ట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, చేత‌న్ స‌కారియా

కోల్‌కతా నైట్ రైడర్స్: ఆరోన్‌ ఫించ్‌, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రాణా, వెంక‌టేశ్ అయ్య‌ర్‌, రింకూ సింగ్, బాబా ఇంద్ర‌జిత్‌, ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, హ‌ర్షిత్ రాణా

 

Read more RELATED
Recommended to you

Exit mobile version