అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం మరింతగా బలపడింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉంది. గురువారం వాయుగుండంగా మారి, వెంటనే మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశావైపు ప్రయాణిస్తుందని తెలిపారు. గురు, శుక్రవారాల్లో కళింగపట్నం, పూరి మధ్య తీరం దాటొచ్చని వివరించారు. ఈ ప్రభావంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల, ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంకట 55కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరింత బలపడిన అల్పపీడనం
By ramu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
కాంగ్రెస్ లోకి శాసనమండలి చైర్మన్ గుత్తా..?
G తొలుత టీడీపీలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. 2009 ఎన్నికల్లో...
Anji N -
ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ హక్కులని కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోంది: మోడీ
ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు హక్కుల్ని రహస్యంగా లాక్కోడానికి కాంగ్రెస్ చూస్తోందని ప్రధాన...
విడుదల రజిని కిడ్నాప్…నామినేషన్ వేయకుండా అడ్డుకున్న వ్యక్తులు
విడుదల రజని కిడ్నాప్ కి గురయ్యారు.అవును మీరు చదువుతున్నది నిజమే. కిడ్నాప్...