BREAKING : తిరిగి డ్యూటీలో చేరిన డీజీపీ మహేందర్ రెడ్డి

-

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి… తిరిగి డ్యూటీలో చేరారు. గత రెండు వారాల మెడికల్ లీవ్ తరువాత.. డ్యూటీలో చేరారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఈ మేరకు ఆయనే అధికారిక ప్రకటన చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఐపీఎస్ అధికారిగా నియామకం అయిన తర్వాత మొట్టమొదటి సారిగా ఇదే నా మెడికల్ లీవ్ అని ఆయన తెలిపారు.

ఎప్పుడూ ఒక్కరోజు కూడా మెడికల్ లీవ్ పెట్టలేదని.. ఇప్పుడే రెండువారాలు లీవ్ పెట్టానని మహేందర్ రెడ్డి వెల్లడించారు. కాగా రెండు వారాల క్రితం… బాత్రూం లో కాలు జారి పడ్డ డీజీపీ మహేందర్ రెడ్డి… రెండు వారాల పాటు లీవ్ పెట్టారు.

అయితే డీజీపీ మహేందర్ రెడ్డి లీవ్ పెట్టడం పై… కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. కావాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… మహేందర్రెడ్డి ని సైడ్ చేసిందని ఆరోపణలు చేశారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేకుండా లీవ్ తీసుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news