‘ఎన్నికల కోసమే ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు డ్రామా’

-

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై  ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే అర్వింద్ పసుపు బోర్డు డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరకాలుగా కుల, మతాల మధ్య గొడవలు పెట్టడం, రెచ్చగొట్టడం తప్ప అర్వింద్ ఏమి చేయలేదు మండిపడ్డారు. దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందని ఆరోపించారు . పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

 

నిజామాబాద్ నియోజకవర్గంలో ఈ సారి కాంగ్రెస్ విజయంత ఖాయమనీ జోస్యం చెప్పారు.రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అరవింద్ కి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుందని అన్నారు.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఇక క్రమంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతోందని ,వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news