కూతురుని బైక్ ఎక్కించుకుని తిప్పుతున్న ధోని…!

-

లాక్ డౌన్ లో చాలా మంది ప్రముఖులు తమ ఇంట్లో ఉండి తమ వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాము ఇంట్లో ఎం ఎం చేస్తున్నాం అనేది ప్రముఖులు పంచుకుంటున్నారు. ఈ జాబితాలో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన ఫాం హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.

తాజాగా తన కుమార్తె ను ఎక్కించుకుని తన యమహా బైక్ తో చక్కర్లు కొట్టాడు ధోని. తన కుమార్తె జీవా వెనుక కూర్చుని పాటలు వింటుంది. ధోని బండి నడుపుతూ ఉండగా… ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అవి ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ధోని బాగా ఎంజాయ్ చేస్తున్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. అతను లైఫ ని లాక్ డౌన్ లో ఎంజాయ్ చేసినట్టు,

ఎవరూ కూడా చేయడం లేదని దేనికి అయినా అద్రుష్టం ఉండాలని జీవితంలో అతను అన్ని సాధించాడని అంటున్నారు. ఇటీవల తన భార్య తో కలిసి బెడ్ రూమ్ లో ఉన్న ఒక ఫోటోలో ధోని కనిపించాడు. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నేడు బైక్ మీద తన భార్య సాక్షి సింగ్ ని కూడా ఎక్కించుకుని తిప్పాడు ధోని. తన భార్య సాక్షి ఈ ఫోటోలు షేర్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news