మాస్క్ ఉండి కూడా వాడని మూర్ఖులకు అంకితం ఈ ఫోటో…!

-

మాస్క్ వాడాలి… లేకపోతే కరోనా వైరస్ వస్తుంది. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మాస్క్ కి ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు కూడా మాస్క్ ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చాయి. మన దేశంలో ప్రధాని నుంచి కింది స్థాయి వరకు అందరూ మాస్క్ ని వాడుతున్నారు.

మరి మాస్క్ ని అడవి బిడ్డలు వాడాలి అంటే ఎలా…? వారికి ఉండదు కదా మాస్క్…?మరి ఇవ్వడానికి ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. దీనితో అడవి బిడ్డలు మాస్క్ లు తామే తయారు చేసుకున్నారు. మాస్క్ లేకపోవడంతో తమ వద్ద దొరికే పెద్ద ఆకులకు తాటాకులు కట్టుకుని దాన్ని మాస్క్ గా వాడుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గంగమ్మ కాలనీలో ఆకులను మాస్క్‌కు కట్టుకుని ధరించిన  ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుబాటులో ఉన్నా సరే చాలా మంది మాస్క్ లను పెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. అయినా సరే ఇలా గిరి పుత్రులు చేయడం చూసి పలువురు షాక్ అవుతున్నారు. వాళ్ళను చూసి నేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news