నిన్నటి ఓటమిపై ధోని మరో సాకు చెప్పాడు..?

-

ఐపీఎల్లో దిగ్గజ జట్టుగా ప్రస్థానం కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో అసలు సత్తా చాట లేక పోతుంది అనే చెప్పాలి. నాలుగు మ్యాచ్ లు ఆడితే వరుసగా మూడు మ్యాచ్ లలో కూడా ఓటమిని చవిచూసింది. నిన్నటి మ్యాచ్ అయితే మరీ దారుణం. సాదాసీదా 165 పరుగుల విజయ లక్ష్యాన్ని కూడా చేధించలేక చేతులెత్తేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. గొప్ప బ్యాటింగ్ లైనప్ కలిగినప్పటికీ కూడా చెన్నై సూపర్ కింగ్ ప్రత్యర్థి తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది.

అంతేకాదు మునుపెన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున మూలుగుతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే నిన్నటి ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఓడిపోవడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. నో బాల్స్ ఎక్కువగా ఇవ్వడం, క్యాచ్ లు వదిలేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధోనీ ఇలాంటివి జరిగితే… మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది అంటూ తెలిపాడు. ఇదే నాకౌట్ గేమ్ అయితే పరిస్థితి ఏంటి అంటూ ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా నిన్న హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోనిసేన 2 క్యాచ్లు వదిలేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news