సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు….

-

దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి తనయుడు ఆశీష్ రెడ్డి రౌడీ బాయ్స్ అనే యూతుపుల్ ఎంటర్టైనర్తో హీరోగా టాలీవుడ్ లోకి అరంగెట్రం చేశాడు.ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు డైరెక్షన్ లో సెల్ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండో చిత్రం విడుదల కాకుండానే త్వరలోనే ఆశిష్ రెడ్డి వివాహం జరగబోతోంది.ఏపీకి చెందిన అద్విత రెడ్డి అనే అమ్మాయిని ఆశిష్ వివాహం చేసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో దిల్ రాజు తన సోదరుడి కుమారుడిని తీసుకుని, ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలను కూడా దిల్ రాజు స్వయంగా పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.సినీ ప్రముఖులు అందరి దగ్గరికి వెళ్లి పెళ్లికి రావాలని ఆహ్వానిస్తున్నారు.

 

ఇక ఈ నేపథ్యంలో దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్, కుమార్తె, అల్లుడు, దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ ఈరోజు సీఎం ని కలిశారు.అనంతరం ఆశిష్ పెళ్లి వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్ల వైరల్ అవుతున్నాయి.ఆశిష్ రెడ్డి ఎంగేజ్ మెంట్ 2023 నవంబర్ లో ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహం వాలెంటైన్స్ డే రోజు అంటే ఫిబ్రవరి 14 న జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా నిర్వహించనున్నారు. దిల్ రాజు కుటుంబంలో మొట్ట మొదటి వారసుడు కావడంతో ఆశిష్ రెడ్డి వివాహాము ఘనంగా జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news