రెండు డోసులు వేసుకున్నా ఖిలాడీ హీరోయిన్ ను వ‌ద‌లని క‌రోనా…!

-

క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జాగ్ర‌త్త‌లు తీసుకున్నా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఇక సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటూ సెలబ్రెటీలు రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా భారిన ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా ఖిలాడీ హీరోయిన్ క‌రోనా భారిన పడింది. ఖిలాడీలో ర‌వితేజ కు జోడీగా న‌టిస్తున్న హీరోయిన్ డింపుల్ హ‌యాతీకి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని తానే వెల్ల‌డించింది.

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాన‌ని అయినా పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం త‌నకు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని రెండు డోసులు తీసుకోవ‌డం వ‌ల్లే త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉ్నాయ‌ని పేర్కింది. తాను హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నాన‌ని చెప్పింది. ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పింది. ఇదిలా ఉండ‌గా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాలో అన‌సూయ కూడా న‌టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news