క్రికెటర్‌తో శంకర్ కూతురు పెళ్లి.. ప్రత్యేక ఆకర్షణగా సీఎం

-

ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు వివాహం ఇవాళ జరిగింది. తమిళనాడులోని మహాబలిపురం లో తన కూతురు ఐశ్వర్యను ప్రముఖ క్రికెటర్ రోహిత్ దామోదరన్ కి ఇచ్చి వివాహం జరిపించారు శంకర్. కరోనా నేపథ్యంలో…ఈ వివాహ కార్యక్రమం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరిగింది. అయితే దర్శకుడు శంకర్ కూతురు వివాహానికి… కొత్త ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం స్టాలిన్ తో సహా తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, హీరో, ప్రస్తుత ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

గత కొద్ది రోజులుగా శంకర్ కూతురు వివాహం గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఘనంగా శంకర్ కూతురు వివాహం జరిగింది. కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో డైరెక్టర్ శంకర్ ఓ కొత్త మూవీ చేస్తున్నారు. ఈ సినిమా మా గురించి ఇప్పటికే అఫీషియల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ – 2 సినిమా పూర్తి చేసి చరణ్ సినిమాను శంకర్ సెట్స్ మీదకు తీసుకెళాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news