ఫైన‌ల్ లో మ‌ళ్లీ నిరాశే.. వ‌ర‌ల్డ్ టూర్ లో సింధుకు ర‌జ‌తం

-

ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ టూర్ లో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు ర‌జితం తో స‌రి పెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ద‌క్షిణ కొరియా బ్యాడ్మింట‌న్ స్టార్ యాన్ సేయంగ్ పై దారుణం అయిన ఓట‌మి ని చ‌వి చూసి ర‌జితం తో స‌రిపెట్టుకుంది. 16-21 , 12-21 తో రెండు వ‌రుస సెట్ ల‌లో పీ వీ సింధు ఓట‌మి పాలు అయింది. దీంతో ఈ ఏడాది వర‌ల్డ్ టూర్ లో రెండో స్థానం తో స‌రిపెట్టుకుంది. కాగ ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో పీ వీ సింధు గెలుపు న‌కు ఒక్క అవ‌కాశం కూడా ద‌క్క‌లేదు. యాన్ సేయంగ్ మ్యాచ్ పై పూర్తి ఆధిప‌త్యాన్ని చేల‌యించింది.

దీంతో పీ వీ సింధు కు ఓట‌మి త‌ప్ప‌లేదు. కాగ భార‌త్ బ్యాడ్మింట‌న్ స్టార్ వీవీ సింధు కు ఫైన‌ల్ ఫోబియా ఉంటుంద‌ని మ‌రో సారి రుజువు అయింది. పీ వీ సింధు ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సార్లు ఫైన‌ల్ మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలు అయింది. దీంతో పీ వీ సింధు కు ఫైన‌ల్ ఫోబియా ఉంద‌నే వార్త‌లు గ‌తం లో వ‌చ్చాయి. అయితే తాజా గా మ‌రో సారి ఫైన‌ల్ లో ఓడి పోవ‌డం తో ఈ ఫైన‌ల్ ఫోబియా టాపిక్ మ‌ళ్లీ ముందుకు వ‌చ్చింది. కాగ బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ ఫేడ‌రేష‌న్ ఆధ్వ‌ర్యం లో ఇండోనిసియా లో ని బాలీ లో బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ టూర్ ను నిర్వ‌హిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news