బంగారు తెలంగాణను.. చావుల తెలంగాణ చేసాడు : వైఎస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై.. వైయస్సార్ టీపి పార్టీ అధినేత వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణను చావుల తెలంగాణ సీఎం కేసీఆర్ మార్చారా అంటూ సంచలన ట్వీట్ చేశారు వైయస్ షర్మిల. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ఆర్టీసీ కార్మికులు తెలంగాణ లో చనిపోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైయస్ షర్మిల.

Sharmila comments on cm kcr
Sharmila comments on cm kcr

“బంగారు తెలంగాణను చావుల తెలంగాణ చేసాడు కెసిఆర్ గారు. విద్యార్థుల చావులు, నిరుద్యోగుల చావులు, రైతుల చావులు, RTC కార్మికుల చావులు, ఇప్పుడు సర్పంచ్ ల చావులు. చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక చావే శరణ్యం అని రాష్ట్రంలోని సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు” అంటూ ఫైర్ అయ్యారు.

మొన్న సర్పంచ్ అజారుద్దీన్,అప్పుతెచ్చి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాక, భార్య మెడలో ఉన్న బంగారాన్ని అమ్మినా అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. “ఇవాళ సర్పంచ్ స్వాతి బిల్లులు రాక కిరోసిన్ పోసుకొని చావాలనుకుందని… గ్రామసేవ చేద్దామనుకున్న పాపానికి ప్రాణాలు తీస్తున్నారు దొర” అంటూ ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news