కరీంనగర్ లో కరోనా కలకలం… మెడికల్ కాలేజీలో 39 మందికి కరోనా..

-

కరోనా మళ్లీ కలవరపెడుతోంది. క్రమంగా కేసులు మళ్లీ ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాలేజీలు, గురుకులాల్లో, పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. తాజగా మరోసారి కరీంనగర్ లో కలకలం రేగింది. నగరంలోని చెల్మెడ వైద్య కళాశాలలో 39 మందికి వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం కాలేజీకి సెలవులు ప్రకటించింది. మిగతా విద్యార్థులకు టెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, ముత్తంగి గురుకులాలతో పాటు, ఖమ్మం జిల్లా వైరాలో కూడా విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపింది.

ఇంతకు ముందు కర్ణాటకలో కూడా ఇలానే ఓ వైద్య కళాశాలలో విద్యార్థులకు కరోనా సోకింది. ధార్వాడ్ లోని ఎస్డీఎమ్ కళాశాలలో 281 మందికి కరోనా సోకడం సంచలనం కలిగించింది. అక్కడ కూడా మెడికల్ కాలేజీకి సెలవులు ప్రకటించారు. విద్యార్థులందరికి కరోనా టెస్టులు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news