బీజేపీపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ ?

-

తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇందులో భాగంగా తెలంగాణలో నేటి నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్రలు ప్రారంభించింది.తమకు ఎంతో కలిసొచ్చిన రథయాత్ర పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రులకు బీజేపీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రమొత్తాన్ని లోక్ సభ నియోజకవర్గాల వారీగా 5 క్లస్టర్లుగా విభజించి…ఒక్కో క్లస్టర్ కు ఒక రథాన్ని పంపింది.

ఇదిలా ఉంటే….బీజేపీ రాష్ట్ర అధినాయకత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అలక వహించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ ప్రారంభించిన విజయ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవానికి ఆయన రాలేదు. ఇవాల్టి భువనగిరి సభకూ హాజరు కాలేదు. కాగా బీజేఎల్పీ టీంలో రాజాసింగ్కు అవకాశం దక్కకపోవడంతోనే ఆయన అసంతృప్తికి గురైనట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news