ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ రద్దు

-

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 135,జనసేన 21, బీజేపీ 8, వైఎస్సార్ సీపీలకు 11 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీచేశారు. ఆర్టికల్ 174 ప్రకారం కేబినెట్ సిఫార్సు తో గవర్నర్ అసెంబ్లీ రద్దు చేశారు.ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక సీట్లు గెలవడంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.జూన్ 9న లేదా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలక పాత్ర పోషించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news