Tokyo Paralympics : బ్యాడ్మింటన్ లో సుహాస్ కు సిల్వర్…

-

టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు తమ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే 17 పతకాలు సాధించిన మన భారత క్రీడాకారులు… తాజాగా మరో పతకాన్ని సాధించారు. టోక్యో పారా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత్ కు మరో రజత పతకం వచ్చింది.

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ 4 ఈ విభాగంలో భారత అథ్లెట్ సుహాస్.. రజత పతకాన్ని సాధించాడు. ఈ బ్యాడ్మిం టన్ పురుషుల సింగిల్స్ లో… ఫ్రాన్స్ దేశానికి చెందిన లుకాస్ మజుర్ చేతిలో ఓటమి చెందిన సుహాస్… చివరికి రజత పతకం సాధించి వెను దిరిగాడు. దీంతో భారత ఖాతాలో మరో పతకం చేరింది. ఈ రజతం తో భారత పతకాల సంఖ్య 18 కి చేరింది. కాగా నిన్నటి రోజున భారత ఖాతా లో ఏకంగా నాలుగు పతకాలు పడ్డ సంగతి తెలిసిందే. రెండు పతకాలు బ్యాడ్మింటన్ లో కాగా.. మరో రెండు పతకాలు షూటింగ్ విభాగం లో వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news