కేంద్రంలోని పదేళ్ల బీజేపీ పాలనపై కనీసం ప్రశ్నించరా ? : సీఎం రేవంత్ రెడ్డి

-

రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో కేసీఆర్ అన్నారు.. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో కేసీఆర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై బీఆర్ఎస్ విధానం ఏమిటో కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ…… రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని చూసే బీజేపీపై కేసీఆర్ పోరాటం ఏదని.. కేవలం మా ప్రభుత్వాన్ని కూల్చడానికే మీ కార్యాచరణా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు.

మీ ప్రతాపమంతా కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనపైనేనని.. కేంద్రంలోని 10 సంవత్సరాలు బీజేపీ పాలనపై కనీసం ప్రశ్నించరా అని రేవంత్ రెడ్డి అన్నారు.లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 5 సీట్లు బీజేపీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనడానికి మల్లారెడ్డి, ఈటల రాజేందర్ సంభాషణే నిదర్శనమని తెలిపారు. బీజేపీతో చీకటి ఒప్పందం నిజం కాకపోతే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ,ఈటల రాజేందర్‌ను కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ విమర్శించరు ఎందుకని.. బీజేపీతో అగ్రిమెంట్‌లో భాగంగానే ఆయనపై ఎలాంటి విమర్శలు చేయరని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news