సినిమాలకు దూరమైన సుధీర్ బాబు హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

-

సాధారణంగా కొంతమంది ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని ఉన్నత స్థానానికి చేరుకుంటే.. మరి కొంతమంది మొదట్లో మంచి సక్సెస్ పొంది ఆ తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సుధీర్ బాబు హీరోయిన్ నందిత రాజ్ కూడా ఒకరు. ముగ్ధ మనోహరమైన మోముతో చారడేసి కళ్ళు ఇలా చూడగానే అలా ఆకట్టుకునే అందం ఆమె సొంతం మారుతీ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో అందం, అభినయం పరంగా మంచి పేరు సొంతం చేసుకుంది నందిత. దెయ్యంగా సప్తగిరికి చుక్కలు చూపించే పాత్రలో ఆమె అభినయం అందరికీ గుర్తుండిపోతుంది. అలాగే తేజ డైరెక్షన్లో వచ్చిన నీకు నాకు డ్యాష్ డ్యాష్ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది నందిత. ఆ తర్వాత లవర్స్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, శంకరాభరణం, రామ్ లీలా , సావిత్రి తదితర సినిమాలలో నటించింది. ఎన్టీఆర్ జై లవకుశ, కథలో రాజకుమారి సినిమాలలో కూడా క్యామియో రోల్ పోషించిన నందిత 2019లో విశ్వామిత్ర సినిమాలో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.

మొన్న మధ్య ప్రముఖ దర్శకుడు తీయబోయే వెబ్ సిరీస్ లో నటిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు ఈమె ఇండస్ట్రీకి దూరం అయింది. మరి ఏం చేస్తోంది అనే వార్తలు వైరల్ అవుతుండగా ఆమె ఒక మోడల్.. ఇప్పుడు సినిమాల్లోకి రాకుండా మోడలింగ్ రంగంలో రాణించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మను అభిమానులు మిస్ అవుతున్నారని చెప్పవచ్చు

Read more RELATED
Recommended to you

Latest news