కార్తీక మాసంలో ఏరోజు.. ఏం చేయాలో తెలుసా..?

-

కార్తీక మాసం..హిందువులకు అత్యంత పవిత్రమైన నెల. తులసీ పూజలు, వన భోజనాలు, సమారధాలు, ఉపవాసమలు, అభిషేకాలు, సహస్రనామ పారాయణలతో మార్మోగుతూ ఎంతటి నాస్తికుడైనా ఆస్తికభావానలు కలుగజేసే మాసమిది. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఈ మాసంలో ముప్పై రోజులు పర్వదినాలే..!

అయితే ఈ నెలలో ఏరోజు ఏం చేస్తే మంచిది.. ఎలాంటి పూజలు చేయాలి ఓసారి చూద్దాం..

karthika-deepam

పాడ్యమి: కార్తీక శుద్ధ పాడ్యమి… తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయనికెళ్ళి, ‘నేను చేయదలచిన కార్తీక వ్రతం నిర్విజ్ఞం గా సాగేటట్లు అనుగ్రహింపు’మని ప్రార్దించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.

విదియ: ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.

తదియ: ఈనాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకుంటే స్త్రీలకు సౌభాగ్య సిద్ది కలుగుతుంది.

చవితి: కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా సుబ్రమంఎస్వర స్వామికి పుట్టలో పాలు పోయాలి.

పంచమి: దీనినే జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈరోజు శుబ్రమణ్యేస్వర స్వామి ప్రీత్యర్ధం అర్చనలు, అభిషేకాలు, చేయించుకున్నవారికి జ్ఞానవ్రుద్ది కలుగుతుంది.

షష్టి: నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాదులతో సహా ఎర్రగళ్ళ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.

సప్తమి: ఈరోజు ఎర్రవస్త్రంలో గోదుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ది అవుతుందని శాస్త్రోక్తి.

అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే “గోపూజ” విశేష ఫలితాలనిస్తుంది.

నవమి: నేటినుండి మూడురోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజ రాత్రి విష్ణుపూజ చేయాలి.

దశమి: నేడు విష్ణు సహస్రనామ పారాయణ చేసి, గుమ్మడికాయను, ఉసిరికాయను దానం చేయాలి.

ఏకాదశి: ఈ ఏకాదశికే భోధనైకాదశి అని పేరు. ఈరోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి.

ద్వాదశి: ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం తులసికోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసికీ, ఉసిరికీ కళ్యాణం చేయించటం సకల పాపాలని క్షీణింప జేస్తుందని ప్రతీతి.

త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానం చేయటం వల్ల సకల కష్టాలు దూరమౌతాయని శాస్త్రోక్తి.

చతుర్దశి: నేడు శనైశ్చర ప్రాత్యర్డం ఇనుము, నువ్వులు, పత్తి, మినుములు, మొదలైన వాటిని దానం చేయటం వల్ల శని సంతృప్తి చెంది శుభ దృష్టిని ప్రసాదిస్తాడు.

పౌర్ణమి: కార్తీక పూర్ణిమ, మహాపవిత్రమైన ఈరోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల పాపాలనీ పటాపంచలౌతాయి.

పాడ్యమి: (కార్తీక బహుళ పాడ్యమి) ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం.

విదియ: వనభోజనం చేయటం విశేష ఫలాలనిస్తుంది.

తదియ: పండితులకు, గురువులకు తులసీమాలను సమర్పించటం వల్ల తెలివితేటలు వృద్ది అవుతాయి.

చవితి: పగలంతా ఉపవాసముండి, సాయంత్రం వేల గణపతిని గారిక తో పూజ చేసి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుటే దుస్వప్న దోషాలు పోయి సంపదలు కలుగుతాయి.

పంచమి: ఈరోజు చీమలకు నూకలు చల్లటం, శునకాలకు అన్నం తినిపించటం శుభ ఫలితాలనిస్తుంది.

షష్టి: గ్రామదేవతలకు పూజచేయటం వల్ల వారు సంతుష్టులై, ఏ విధమైన కీడు కలుగకుండా కాపాడుతారు.

సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండనీ ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ది చెందుతాయి.

అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి, కాలభైరవానికి (కుక్కకు) సమర్పించటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

నవమి: వెండి లేదా రాగి కలశం లో నీరు పోసి పండితునికి బ్రాహ్మణునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.

దశమి: నేడు అన్నసంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరుతాయని పురాణోక్తి.

ఏకాదశి: ఈనాటి విష్ణ్యాలయం లో దీపారాదన, పురాణ శ్రవణం, పటనం, జాగరణ మున్నగునవి విశేష ఫలదాయకం.

ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించటం శుభప్రదం.

త్రయోదశి: నవగ్రహారాదన చేయటం వల్ల గ్రహదోషాలు తోలుగుతాయి.

చతుర్దశి: ఈమాస శివరాత్రినాడు ఈస్వరర్చన, అభిషేకం చేయటం వల్ల అపంరుత్యుదోశాలు, గ్రహబాడలు తొలగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులౌతారని పురాణోక్తి.

అమావాస్య: ఈరోజు పిత్రు దేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలచి వారికి భోజనం పెట్టాలి. లేదా పండితులకు, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. పగలు ఉపవాసం ఉండటం మంచిది. శివకేశవ ప్రీత్యర్డం దీపారాదన చేసి, కొబ్బరికాయ కోట్టి నమస్కరించాలి.

క్షీరాబ్ది ద్వాదశి నాడు స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాదనలు చేసి షోడశోపచారాలతో తులసీ కళ్యాణం జరిపి, లక్ష్మీనారాయణులను పూజించాలి.

Read more RELATED
Recommended to you

Latest news