పాపికొండలు వెళ్లాలనుకుంటున్నారా..? ఏపీ పర్యాటక శాఖ స్పెషల్ ప్యాకేజీ వివరాలని చూద్దాం..!

-

మీరు పాపికొండలు వెళ్లాలని అనుకుంటున్నారా..? పాపికొండల అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. దట్టమైన అడవుల నుండి లోపలకి వెళ్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. పాపికొండల టూర్ తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్. చాలా మంది దూర ప్రాంతాల నుండి వస్తూ వుంటారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పాపికొండల స్పెషల్ ప్యాకేజీలను ప్రకటించింది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఒకటి, రెండు రోజులు ఎంచక్కా ఈ ప్రదేశాలకి వెళ్లి రావచ్చు. చక్కగా అందరితో వెళితే ఆనందంగా ఉండచ్చు. రాజమహేంద్రవరం, పోచవరం, గండి పోచమ్మ నుండి ఇది స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ప్యాకేజీ ధరల విషయానికి వస్తే.. పెద్దలకు రూ.1,250, చిన్నారులకు రూ.1,050గా వుంది. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7.30 వరకు ఈ టూర్ సాగుతుంది.

పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 వసూలు చేస్తున్నారు. ఈ ప్యాకేజీ ని పొందాలని అనుకుంటే 98486 29341, 98488 83091 నెంబర్ల కి ఫోన్ చేసి మాట్లాడచ్చు. పోచవరం నుంచి పాపికొండలకు కూడా రెండు ప్యాకేజీలు వున్నాయట. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు ఈ ప్యాకేజీ ఉంటుంది. ఇంకో ప్యాకేజీ అయితే రెండు రోజులు. ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు వచ్చేయచ్చు. ఇక ధరల విషయానికి వస్తే.. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 గా వుంది. రెండు రోజుల ప్యాకేజీ కి అయితే పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 ధర గా వుంది.

Read more RELATED
Recommended to you

Latest news