మాజీ సిఎంకు కూతుళ్ళ మీద ప్రేమ లేదా…? అందుకే కొడుకులను…!

-

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఇప్పుడు అక్కడ అధికార విపక్షాలు మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నితీష్ కుమార్ కేంద్రంగా రాజకీయం జరుగుతుంది. నితీష్ కుమార్ ని టార్గెట్ చేస్తూ ఎల్జెపి, ఆర్జెడి తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా నితీష్ కుమార్ లాలు ప్రసాద్ యాదవ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. లాలు ప్రసాద్ యాదవ్ కి కూతుళ్ళ మీద ప్రేమ లేదని అన్నారు.

అందుకే ఆయన కొడుకులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని చెప్పారు. కూతుళ్ళ మీద విశ్వాసం ఉంటే ముందు నుంచి ప్రోత్సహించే వారని ఆయన అన్నారు. మొదటిదశ పోలింగ్ ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. రేపు బీహార్ లో తొలిదశ పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్, ఆర్జెడి కలిసి పోటీ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news