విద్యార్థులకు మాతృభాషను దూరం చేయొద్దు.. రేవంత్‌కు మాజీ ఉపరాష్ట్రపతి సూచన

-

విద్యార్థులకు వారి మాతృభాషను దూరం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇంటర్ విద్య స్థాయిలో సంస్కృతం రెండో భాషగా చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదని కథనాలు వస్తున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా వెంకయ్య నాయుడు స్పందించారు.

‘ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారిస్తున్నాను. మార్కుల దృష్ట్యా అయితే మాత్రం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలి.విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు, అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యావిధానం- 2020 సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చింది.ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news