డబుల్ ఇస్మార్ట్ విడుదల అప్పుడే : రామ్ పోతినేని

-

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ హీరో రామ్ పోతినేని హీరోగా వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం విడుదలయి చాలా సంవత్సరాల అయినప్పటికీ కూడా క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా పూర్తి చేశారు.

ఈ చిత్రం మార్చ్ లోనే విడుదల కావాల్సి ఉంది.అయితే మరికొంత షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉండడంతో ఈ చిత్రం విడుదల తేదీని పోస్ట్ పోన్ చేశారు. కానీ మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో భాగంగా డబుల్ స్మార్ట్ గురించి హీరో రామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news