సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు నిషికాంత్ కామత్‌ కన్నుమూత..!

-

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నిషికాంత్‌ కామత్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన ఇటీవల  హైదరాబాద్‌ గచ్చిబౌళిలో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి లివర్‌ సిరోసిస్‌ కారణమని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిషికాంత్‌ మలయాళ హిట్‌ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు‌.

అలాగే ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ’ వంటి సినిమాలకు కూడా వహించారు‌. అలాగే ‘హవా ఆనే దే’ అనే హిందీ చిత్రంలో, ‘సాచ్య ఆట ఘరాట్‌’ అనే మరాఠీ సినిమాలో, ‘రాకీ హ్యాండ్సమ్‌’ అనే సినిమాలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. కాగా, ఆయన మరణం పట్ల పలువురు బాలీవుడ్‌ సినీ‌ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news