నల్గొండలో ఘరానా మోసం..64 మంది లగేజీతో ఉన్న బస్సును దొంగిలించిన డ్రైవర్‌ !

-

నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి నార్కట్ పల్లి వద్ద భోజనాని కని హోటల్ వద్ద బస్సు నిలిపాడు డ్రైవర్‌. దీంతో ప్రయాణికులు హోటల్ లోకి వెళ్ళగానే బస్సుతో ఉడాయించారు డ్రైవర్,క్లీనర్. బస్సులోనే 64 మంది ప్రయాణికుల లగేజ్ ఉండటం గమనార్హం. దీంతో లభోదిబోమంటూ పోలీసులకు పిర్యాదు చేశారు ప్రయాణికులు.

భాదితులంతా అస్సాంకు చెందిన కూలీలు కావడం గమనార్హం. కేరళ నుంచి ఈ ప్రైవేట్‌ బస్సు అస్సాం వెళుతోంది. కేరళలోని ఎర్నాకులంలో ఓ ఏజెంట్ ద్వారా బస్సు బుక్ చేసుకున్నారు భాదితులు. లాగేజ్‌ దొంగిలించడంతో నార్కట్ పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆశ్రయించారు పోలీసులు. బస్సు నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య కూలీలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు నిన్న రాత్రి నుంచి భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే.

Read more RELATED
Recommended to you

Latest news