హైదరాబాద్‌ లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత

-

హైదరాబాద్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టి వేశారు అధికారులు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై డీఆర్‌ఐ దాడి చేయగా అక్కడ 250 కిలోల దొరికింది. ఆ మెపిడ్రిన్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ డ్రగ్స్ దందా ముంబై కేంద్రంగా నడుస్తున్నట్టు తేలింది.

హైదరాబాద్‌లో రా మెటిరీయల్స్‌ను తయారు చేస్తున్న ముఠా హైదరాబాద్ నుంచి ముంబైకి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. మెపిడ్రిన్‌తో ఎండీఎంఏ, కొకైన్, అంపెటమిన్ లాంటి డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక మియావ్, మియావ్ డ్రోన్ పేర్లతో డ్రగ్స్ విక్రయాలు సాగిస్తోంది ఈ ముఠా. కేవలం కాలేజీ పరిసర ప్రాంతాల్లోనే ముఠా డ్రగ్స్‌ను అమ్ముతున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో 4 చోట్ల డీఆర్‌ఐ సోదాలు చేసి ఆరుగురుని అరెస్ట్ కూడా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news