JUST IN:ఆరేళ్ళ తర్వాత థియేటర్ లలోకి హీరో విక్రమ్ “ధృవనక్షత్రం”

-

ఒక్కోసారి కొన్ని సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకుని చాలా కాలం అయినప్పటికీ, వివిధ కారణాల వలన విడుదల కాకుండా ఉండిపోతాయి. ఆ విధంగా చాలా సినిమాలు ఎంతో కాలానికి కాని విడుదల కావు.. ఇక తాజాగా ఇలాంటి ఒక మూవీ గురించి ఫ్లాష్ న్యూస్ వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం తమిళ హీరో చియాన్ విక్రమ్ మరియు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో 2016వ సంవత్సరంలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకుని, ఆ తర్వాత సంవత్సరంలోనే విడుదలకు సిద్ధం అయింది. కానీ ఎందుకో చాలా కారణాల వలన విడుదల కాలేకపోయింది. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.. అంతే కాకుండా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. గౌతమ్ మీనన్ సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది తెలిసిందే..

ఈ సినిమా కూడా యాక్షన్ ప్రేమికులను ఆకట్టుకుంటుందని మూవీ యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమాను నవంబర్ 24వ తేదీన థియేటర్ లలోకి విడుదల కానుంది. అంటే ఆరు సంవత్సరాల తర్వాత విడుదల కానున్న సినిమాగా రికార్డ్ సృష్టించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version